సీతం కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 

Apr 7,2024 12:44 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సీతం కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ఈ దినోత్సవానికి హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ అంcడ్ ట్రేైనర్ పి సురేష్ కుమార్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, జీవితంలో చాలా ముఖ్యమని ఏది లేకపోయినా సంపాదించుకోవచ్చని ఆరోగ్యం మాత్రం సంపాదించుకోలేమని, ప్రతి ఒక్కరూ చదువుతోపాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా యుక్త వయసు నుండే కాపాడుకోవాలని చెప్పారు. వివిధ వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందు శారీరకంగా ఫిట్ ఉండాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీ  మాట్లాడుతూ స్టూడెంట్స్ మొబైల్ ఉపయోగాన్ని తగ్గించాలని, రాత్రిపూట మొబైల్ ఉపయోగించకూడదని ఆరోగ్యకరమైన అలవాట్లే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ సంవత్సర మెకానికల్, ఈసీఈ విద్యార్థులు, ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామమూర్తి, హెచ్బిఎస్ హెచ్ ఓ డి డాక్టర్ కే శ్రీలత, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.

➡️