పాము కాటుతో మహిళ మృతి

Apr 8,2024 16:42 #Tirupati district

ప్రజాశక్తి-యర్రావారిపాలెం : మండలంలోని నెరబైలు గ్రామపంచాయతీ బీసీ కాలనీకి చెందిన కాంత (45) అనే మతిస్థిమితం లేని మహిళ సోమవారం పాముకాటుతో మృతి చెందినట్లు డాక్టర్ కృష్ణ చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటిదగ్గర చెట్టు కింద ఎండిన ఆకులు శుభ్రం చేస్తుండగా ఏదో కరిసినట్లు అనిపించిందని ఇంటిలోనే ఉండి సొంత వైద్యం చేసుకున్నది. ఈమె కుటుంబ సభ్యులు ఇంటిలో ఎవరు లేకపోవడంతో పరిస్థితి విషమించడం జరిగింది. స్థానికుల సహాయంతో హుటాహుటిన స్థానిక ప్రాథమిక హాస్పిటల్ కి తీసుకురావడంతో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో 108 ద్వారా తిరుపతికి తరలించే లోపల మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

➡️