నార్పలలో మహిళా హత్య

Feb 3,2024 14:23 #Anantapur District
woman murder in narpala

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండలంలోని బి పప్పూరు గ్రామానికి చెందిన నెట్టెం లక్ష్మి నారాయణమ్మ వయసు (52) చింత కాయలు కోయడం కోసం ఈ నెల 01వ తేది తోటకు వెళ్ళింది. అప్పటినుంచి ఆమె కనిపించలేదు. ఈ రోజు బంధువులు వెతకగా ఆమె మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో మోదీ మెడలోని గొలుసులు, కమ్మలు లాక్కెళ్ళి అరటి తోటలో పూడ్చివేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు.

➡️