సర్పంచ్ ప్రేమ్ కుమార్
ప్రజాశక్తి-చిప్పగిరి : నేమకల్లు గ్రామంలో సర్పంచ్ ప్రేమ్ కుమార్ మరింత బాధ్యతతో ప్రజలు త్రాగునీటికి పండుగ పూట ఇబ్బందులు పడకూడదని గత నాలుగు రోజుల నుంచి గ్రామంలో ఏ కాలనీలో అయితే మంచినీటి కొరత ఉందో తెలుసుకొని వెంటనే ట్రాక్టర్ల ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో కొన్ని కాలనీలకు కొంతమంది మోటర్లు వేసుకోవడం ద్వారా చివర ఉన్నవారికి మంచినీరు అందడం లేదని తెలుసుకొని, వారందరికీ కూడా ట్రాక్టర్లు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవములు ప్రారంభం అవుతున్నందున మరింత బాధ్యతతో ఎక్కువ ట్రాక్టర్ల ట్యాంకర్లు పెట్టి మంచినీటి సరఫరా చేయుటకు సిద్ధముగా ఉన్నామన్నారు. నీటి సరఫరా చేస్తున్నందుకు గ్రామ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.