చెన్నై: భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ కెరీర్లో మూడో ఐటిఎప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. చంద్రశేఖర్ పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన కలబరాగి ఓపెన్ ఫైనల్లో రామ్కుమార్ 6-2, 6-1తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ పిచ్లర్ను చిత్తుచేశాడు. ఈ మ్యాచ్ను రామ్కుమార్ కేవలం 64నిమిషాల్లోనే ముగించాడు. తొలిసెట్లో రెండు, రెండో సెట్లో మూడు బ్రేక్ పాయింట్లు సాధించి రామ్కుమార్ విజేతగా నిలిచాడు. టైటిల్ విజేతగా నిలిచిన రామ్కుమార్కు 3,200 డాలర్ల ప్రైజ్మనీతోపాటు 25 ఏటిపి పాయింట్లు కూడా జమ అయ్యాయి.