వృద్ధికి రెక్కలు !

Jan 24,2024 09:41 #Growth, #Wings
  • ఎన్నికల వేళ భారీగా నమోదు
  • సర్కారు అంకెల గారడి
  • 16.22 శాతంగా గణించిన ప్రణాళిక శాఖ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం గణాంకాల గారడికి సిద్ధమౌతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వృద్ధి లెక్కలకు ప్రభుత్వం రెక్కలు తొడుగుతోంది. దీంతో గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్రంలో వృద్ధి చోటుచేసుకున్నట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు సిద్ధం చేసింది. ఈ ఊహాతీత వృద్ధి పట్ల ఆశాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి 2023 ఆర్థిక సంవత్స రంలో భారీ వర్షాల కారణంగా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. కరోనా తరువాత ఉపాధి రంగమూ ఇంకా పుంజుకోలేదు. ఐటి పరిశ్రమలు రాష్ట్రానికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ అన్ని రంగాల్లోనూ భారీ వృద్ధి నమోదైనట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు సిద్ధం చేసింది. రానున్న శాసనసభ సమావేశాల్లో ఈ గణాంకాలనే ప్రభుత్వం వినిపించనుందని సమాచారం. 2011 ధరల మేరకు, ప్రస్తుత ధరల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చోటుచేసుకున్న ఉన్న వృద్ధి వివరాలను ప్రణాళిక శాఖ రూపొందించింది. తాజా ధరల మేరకు 2022-23 ఆర్థిక సంవత్స రంలో జిఎస్‌డిపి ఏకంగా రూ.13, 17,728 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. అదే గతేడాది అయితే జిఎస్‌డిపి రూ.11,33,837 కోట్లుగా ఉరదని, దీరతో తాజాగా 16.22 శాతం వృద్ధిగా నమోదైరదని ప్రణాళిక శాఖ వివరిరచిరది. జివిఎ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌) కూడా అదే స్థాయిలో నమోదైరది. గత ఏడాది 10,40,187 కోట్లుగా ఉన్న జివిఎ, ఈ ఏడాది 12,14,961 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఒక్క ఏడాదిలోనే 16.80 శాతం వృద్ధి సాధించినట్లు నమోదైంది.

ఆకాశంలో వ్యవసాయ వృద్ధి

రాష్ట్రంలో కీలక రంగమైన వ్యవసాయం విలువ ప్రతియేటా గణనీయంగా పెరిగిపోతున్నట్లు ప్రణాళిక శాఖ అంకెలు చెబుతున్నాయి. 2018-19లో వ్యవసాయ ఉత్పత్తి విలువ రూ.2,76,335 కోట్లుగా ఉరడగా, అది 2022-23 నాటికి ఏకంగా రూ.4,39,645 కోట్లకు చేరుకుంటున్నట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. ఇది గతేడాది కంటే 13.18 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.పారిశ్రామిక రంగంలోనూ వృద్ధేమరో కీలకమైన పారిశ్రామిక రంగంలో కూడా భారీ వృద్ధినమోదైనట్లు అధికారులు తేల్చారు. 2018-19 కన్నా ఏకంగా లక్ష కోట్ల విలువ పెరిగినట్లు చూపిరంచడం విశేషం. 2018-19లో రూ.1,88,601 కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి అది రూ.2,83,821 కోట్లకు చేరుకున్నట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది. ఇది గత ఏడాదికన్నా 16.36 శాతంగా ఉన్నట్లు తేల్చారు. జాతీయ స్థాయిలో కేవలం 14.2 శాతం వృద్ధి నమోదైతే రాష్ట్రంలో రెండు శాతం కన్నా ఎక్కువ వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక సేవా రంగానికి సంబంధించి ఐదేళ్లలో ఏకంగా రూ.1.60 లక్షల కోట్ల విలువ పెరిగినట్లు తెలిపారు. గత ఏడాది 4,07,810 కోట్లుగా విలువ అంచనా వేయగా, 2022-23లో 4,91,496 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ఏకంగా 20.52 శాతం వృద్ధిగా రికార్డయింది.

➡️