మహిళను మహాశక్తిగా చేయాలన్న సంకల్పం

Feb 2,2024 22:38

ప్రజాశక్తి – కర్లపాలెం
మహిళలు శక్తివంతులుగా ఎదగడానికి టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు చేసిన కృషిని ప్రముఖంగా చెప్పుకోవాలని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం టిడిపి అని అన్నారు. మండలంలోని ఎంవి రాజుపాలెం గ్రామంలో ఇంటింటికి టిడిపి, మీ మాట – నా బాట కార్యక్రమాన్ని జనసేన నాయకులతో కలిసి శుక్రవారం నిర్వహించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి టిడిపి, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను మహిళలకు వివరించారు. అనంతరం తన గురించి వివరించే పుస్తకం, చీర, చేతి సంచి ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నుండి 59ఏళ్లలోపు మహిళల ఖాతాలో నెలకు రూ.1500, తల్లికి వందనం పేరుతో రూ.15వేలు ఇస్తామని తెలిపారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు ఉన్నాయని అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే పూర్ టూ రిచ్ పథకం ద్వారా పేదలను రిచ్‌గా చేసేందుకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి వేణుగోపాలరెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షులు నక్కల వెంకటస్వామి, టిడిపి మండల కన్వీనర్ ఏపూరి భూపతిరావు, మాజీ ఎంపీటీసీలు షేక్ బాజీ, సుజాత, మాజీ సర్పంచ్ బొద్దుకూరి విజయ, నాయకులు వసంతరెడ్డి, పఠాన్, దాసు పాల్గొన్నారు.

➡️