ప్రజాశక్తి – తణుకురూరల్
ముఖ్యమంత్రి జగన్ ప్రజల పక్షాన పోరాడుతున్నారని మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు సతీమణి కారుమూరి లక్ష్మీకిరణ్, అల్లుడు దిలీప్కుమార్ అన్నారు. ఆదివారం వైసిపి తణుకు నియోజకవర్గ ఎంఎల్ఎ అభ్యర్థిగా కారుమూరి వెంకటనాగేశ్వరరావును, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల అభ్యర్థిత్వాలను బలపరుస్తూ అత్తిలి మండలం అత్తిలి, గుమ్మంపాడు, వరిఘేడు, బల్లిపాడు తదితర గ్రామాల్లోని ప్రార్ధనా మందిరాలను కారుమూరి లక్ష్మీకిరణ్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ప్రార్ధనా మందిరాన్ని కారుమూరి అల్లుడు దిలీప్కుమార్ సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.