ఒంగోలులో భర్తను చంపిన భార్య

Dec 9,2023 15:34 #Prakasam District
wife killed husband

ప్రజాశక్తి-ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారాంపురంలో ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న దర్శి మల్లికార్జునరావు-అశ్విని మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో చున్నితో భర్తను హతమార్చింది. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితురాలు లొంగిపోయింది. దర్శి మల్లికార్జునరావు-అశ్విని ప్రేమ వివాహం చేసుకొని సంతనూతలపాడు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వాలంటరీగా ఉద్యోగం చేస్తున్న అశ్వినికి వచ్చే జీతం సరిపోక కుటుంబంతో కలిసి ఒంగోలులోని సీతారాంపురం ప్రాంతంలో అద్దెకు నివాసం తీసుకొని జీవనo కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి మల్లికార్జునరావు మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవ జరిగి తన శరీరంపై ఉన్న చున్నీతో భర్త మెడకు చుట్టి హత్య చేసినట్లు సమాచారం. దర్శి మల్లికార్జునరావు-అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

➡️