గరువుపల్లవపాలెం పాఠశాలను సందర్శించిన విప్‌ ముదునూరి

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): మొగల్తూరులోని గరువుపల్లవపాలెంలో గల ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేశారు. భోజనం బాగుంటుందా..? సరిపడా పెడుతున్నారా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలాని పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మూడవ దశలో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

➡️