అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది ? : బాలకృష్ణ

Feb 5,2024 11:31 #ap assembly, #Balakrishna, #MLAs, #police

అమరావతి : అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది ? అని టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ‘బైబై జగన్‌’ అంటూ ప్లకార్డులు పట్టుకొని టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని అడ్డుకున్నారు. టిడిపి వర్గీయులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులంతా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల ఎప్పుడు? పోలవరం పూర్తి ఎక్కడా? అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ … పనైపోయిన వైసిపి ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు ఏముంటుందని అన్నారు. తమను చూసి సిఎం జగన్‌ భయపడుతున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చే నేతలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. బారికేడ్లను తోసుకుంటూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.

➡️