జగన్‌తోనే సంక్షేమం, అభివృద్ధి

Apr 11,2024 01:09 ##YSRCP #Ve

ప్రజాశక్తి – మార్కాపురం
రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని బోడపాడు గ్రామంలో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సర్పంచి రమణారెడ్డి, మాజీ సర్పంచ్ బొగ్గు రవి చెన్నారెడ్డి, వైసీపీ నాయకులు పోరెడ్డి చెంచురెడ్డి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయనతో పాటు ఎపిఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఎంఎల్‌ఎగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని గెలిపించాలని కోరారు. వివక్ష లేకుండా పథకాలు అందించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎఎంసీ మాజీ చైర్మన్లు గుంటక సుబ్బారెడ్డి, బొలమర్రి శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి నారు బాపన్ రెడ్డి, ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️