అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే బాలక్రిష్ణ
పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్య సాయి జిల్లా పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు పుట్టపర్తి మండలం మామిళ్ళ కుంట వద్ద టిడిపి శ్రేణులు, నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. కదిరి నుండి నేరుగా మామిళ్లకుంట క్రాస్కు చేరుకున్న బాలకృష్ణ అక్కడ ఏర్పాటుచేసిన రథంపై నుంచి అభిమానులకు నాయకులకు అభివాదం చేశారు. మామిళ్ళకుంట క్రాస్ నందు ఆయనకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర వెంకట కృష్ణ కిషోర్ , పత్తి చంద్రశేఖర్, కొండమ రాజు, లాయర్ హరికృష్ణ, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కొత్తచెరువులో జరిగే బహిరంగ సభకు బయలుదేరివెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకులు సామకోటి ఆదినారాయణ. మాజీ సర్పంచి చంద్రశేఖర్, శ్రీరామ్ రెడ్డి, పుళ్ళప్ప, విశ్వనాథ్, ప్రసాద్, మాజీ సర్పంచ్ కేశవ, పెడపల్లి రంగప్పా, వేలాదిమంది బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.