”మేము సైతం – రాష్ట్రం కోసం” ప్రారంభం

Apr 24,2024 11:35 #Election Campaign, #TDP

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి తెలుగు ప్రొఫెషనల్స్‌ ఆధ్వర్యంలో ”మేము సైతం – రాష్ట్రం కోసం” మొదటగా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల కేంద్రంలోని ఎర్రకాలినీలో టిడిపి నియోజకవర్గ యువనేత బండారు సంజీవ్‌, ప్రొఫెషనల్‌ వింగ్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ పొడపాటి తేజస్విని, స్టేట్‌ ప్రొఫెషనల్‌ వింగ్‌ జనరల్‌ సెక్రెటరీ కొండయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి రాష్ట్రం అభివఅద్ది వైపు పరుగెత్తాలంటే కూటమి ప్రభుత్వం రావలసిన ఆవశ్యకతను వివరించారు. అలాగే అమలు చేయబోయే పథకాల గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ జిల్లా ప్రొఫెషనల్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ సీతారామ రాజు , జిల్లా జనరల్‌ సెక్రెటరీ బి.ఎన్‌.వి.ఎస్‌.రమేష్‌, నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️