ఈ లోక్సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్గాంధీకి మధ్య జరుగుతున్న యుద్ధం అని మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ పవార్ అన్నారు. పూణే జిల్లాలోని బారామతి లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న తన భార్య సునేత్ర తరుఫున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆయన కుమారులు పార్థ్, జై హాజరయ్యారు. ఎన్సీపీ చీలిక తర్వాత శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలే, సునేత్రల మధ్య పోటీ నెలకొనడంతో ఈ స్థానం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సూలేకు కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన మద్దతు ఉండగా సునేత్రకు బిజెపి, అజిత్ పవార్ ఎన్సీపి, షిండే శివసేన మద్దతునిసున్నాయి. బారామతిలో మే 7న ఓటింగ్ జరగనుంది. బిజెపి ప్రోద్భలంతో శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక అనంతరం ఒకే కుటుంబానికి చెందిన రెండు పార్టీల తరఫున అభ్యర్ధులుగా ఎన్నికల బరిలో ఉండటంతో అజిత్పవార్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.