బాపట్లలో ఓటరు అవగాహన కేంద్రం

Dec 23,2023 23:58

ప్రజాశక్తి – బాపట్ల
స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయ భవనం క్రింది భాగంలో ఓటరు అవగాహన కేంద్రాన్ని ఆర్డీఒ రవీందర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే నేరుగా అభ్యర్థికే చేరుతుందా, లేదా అనే అనుమానాలను ఈ కేంద్రం ద్వారా నివృత్తి చేసుకునేందుకు ఓటరు అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పట్టణ, గ్రామీణ ఓటర్లు సైతం ఓటు వేసే అంశంపై అవగాహన చేసుకోవచ్చని అన్నారు. అందుకోసం డమ్మీ ఓటింగ్ ఈవీఎంలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఓటరు అవగాహన కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దారు చిన్నం సుధారాణి, సీఐ యు శ్రీనివాసులు, డిటి ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండ్రెడ్డి శివ పాల్గొన్నారు.

➡️