బోల్తాపడ్డ వోల్వో బస్సు : 10మందికి తీవ్రగాయాలు

Nov 25,2023 08:56 #10 members, #bus accident, #injured

చింతపల్లి (నల్గొండ) : వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 10మందికి తీవ్రగాయాలైన ఘటన శనివారం నల్గొండ జిల్లా చింతపల్లి శివారులో జరిగింది. నల్గండ జిల్లా చింతపల్లి శివారులో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి మాచర్లక వెళుతుండగా, చింతపల్లి వద్ద నాగార్జునసాగర్‌ రోడ్డుపై బస్సు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

➡️