హిందూపురం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన వాలంటీర్లు

హిందూపురం (అనంతపురం) : కనీస గౌరవ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ … వాలంటీర్లు సమ్మెకు సన్నద్ధమయ్యారు. నేడు ఎపి ప్రభుత్వం చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరించారు. హిందూపురంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను 2019 అక్టోబరులో నియమించింది. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వం తరఫున నిర్వహించే సర్వేల్లోనూ వీరు భాగస్వాములుగా ఉన్నారు. అయితే తమకు గౌరవ వేతనం పెంచే విషయంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్న వాలంటీర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️