టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని అందుకుని టీమిండియా స్టార్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. 12000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 376 మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లి.. 41.21 సగటు, 133.42 స్ట్రయిక్రేట్తో 12000 పరుగులు చేశాడు. . ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్గా కోహ్లి నిలిచాడు.