పెదనందిపాడుకు విమలక్క ప్రజాచైతన్య యాత్ర

Apr 18,2024 00:14

కొల్లా వెంకయ్య విగ్రహం వద్ద నివాళు విమలక్క
ప్రజాశక్తి – పెదనందిపాడు :
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అరుణోదయ సాంస్కృతిక విభాగ, రెండు తెలుగు రాష్ట్రాల చైర్మన్‌, ప్రజా గాయని విమలక్క ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర ఈరోజు పెదనందిపాడుకు చేరుకుంది. పాత బస్టాండ్‌ సెంటర్‌లోని కొల్లా వెంకయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, నిజమైన ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాయని, రాజధానిలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేశారని అన్నారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి వంత పాడుతున్నాయని విమర్శించారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం యత్నిస్తోందన్నారు. కార్పొరేట్లకు రూ.వేలకోట్లు రాయితీలిస్తూ కార్మిక, రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ ప్రజా చైతన్య యాత్రను నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు, కొల్లా అమర్‌, కొల్లా రామన్‌, బోడావుల హనుమంతరావు పాల్గొన్నారు.

➡️