ముంబయి: విజయ్ హజారే టోర్నమెంట్ క్వార్టర్ఫైనల్లోకి తమిళనాడు జట్టు దసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో తమిళనాడు జట్టు స్పిన్నర్ వరణ్ చక్రవర్తి(5/9) లిస్ట్-ఏ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్తో చెలరేగడంతో నాగాలాండ్పై 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-ఇలో నాగాలాండ్ జట్టు తొలిగా బ్యాటింగ్కు దిగి 19.4ఓవర్లలో 69పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తికి తోడు సాయి కిషోర్(3/21) బౌలింగ్లో రాణించారు. అనంతరం తమిళనాడు జట్టు 7.5ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 73పరుగులు గెలిచింది. ఓపెనర్లు సాయికిషోర్(37), నారాయణ జగీశన్(30) వికెట్ కోల్పోకుండా మ్యాచ్ను ముగించాడు. దీంతో గ్రూప్-ఇలో తమిళనాడు 20పాయింట్లతో నేరుగా క్వార్టర్స్కు చేరింది. నేటితో గ్రూప్ లీగ్ పోటీలు ముగియగా.. శనివారం బెంగాల్-గుజరాత్, కేరళ-మహారాష్ట్ర జట్ల మధ్య జరిగే మ్యాచ్లతో క్వార్టర్ఫైనల్ బెర్త్లు ఖరారు కానున్నాయి.