ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

Dec 4,2023 23:57

ప్రజాశక్తి – చెరుకుపల్లి
ఎటువంటి అనుమతి, లైసెన్సులు లేకుండా విక్రయాలు జరుపుతున్న పురుగు మందుల షాపుపై కేసు నమోదు చేసిన సంఘటన మండలంలోని బలుసులపాలెం పంచాయతీ మెట్టగౌడపాలెంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలో వై నాగరాజుకు చెందిన అనుమతులు లేని పురుగు మందుల షాపును విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఏ విధమైన రసీదులు లేకుండానే విక్రయాలు జరుపుకున్నట్లుగా గుర్తించారు. రూ.1,26,536 విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ వ్యవసాయ అధికారి కె రమణకుమార్, ఎస్‌ఐ ఎం రామచంద్రయ్య, ఏఒ టి బాలాజీ గంగాధర్, వీఆర్‌ఒ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

➡️