ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ ఈ నెల 26న తిరుపతికి రానున్నారని కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ 25, 26 తేదీల్లో ఇక్కడే ఉంటారని పేర్కొన్నారు. ఎస్పి కృష్ణకాంత్ పటేల్తో కలిసి కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత ఉప రాష్ట్రపతి తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఈ నెల 26న ఉదయం శ్రీవారిని దర్శించుకొని మధ్యాహ్నం 12.30కు సంస్కృత యూనివర్సిటీ చేరుకుని మూడో స్నాతకోత్సవంలో పాల్గంటారు. అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్ర గవర్నర్ ఏప్రిల్ 25న సాయంత్రం తిరుపతిలో బస చేసి 26న ఉప రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. బర్డ్ ఆస్పత్రి, శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్లను సందర్శిస్తారు. వీడియో కాన్షరెన్స్లో అదనపు ఎస్పి వెంకట్రావు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎఎస్పిలు కులశేఖర్, డిసిహెచ్ఎస్ ఆనంద మూర్తి, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, డిఇఒ శేఖర్ పాల్గొన్నారు.