మనోహర్‌తో వంగవీటి రాధా భేటీ

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సోమవారం రాత్రి కలిశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో దాదాపు అర్ధగంటకు పైగా మనోహర్‌తో ఏకాంతంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలిసారిగా విజయవాడ తూర్పునియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాధాకృష్ణ గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసిపి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కాలక్రమంలో వైసిపికి దూరమైన ఆయన టిడిపిలో చేరారు. తాజాగా టిడిపి, జనసేన, బిజెపి పొత్తుతో ఎన్నికలకు వెళుతున్న వేళ ఆయన మనోహర్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

➡️