ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

Feb 25,2024 14:46 #Kurnool, #Medical camp

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : సుందరయ్య స్ఫూర్తి కేంద్రం, ప్రజారోగ్య వేదిక, ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ నగర్ లోని సుందరయ్య భవన్లో ఆదివారం ప్రతి రెండు నెలలకోసారి నిర్వహించే వైద్య శిబిరానికి జిబిఆర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో బిపి, షుగర్, పక్షవాతం, ఫిట్స్,( మూర్చ) జబ్బులకు డాక్టర్లు మెడికల్ కళాశాల మాజీ సీఎంఓ ఎం. నాగభూషణ్ రావు, ప్రముఖ ఎండో కైనాలజిస్ట్ డి భరత్, జనరల్ ఫిజీషియన్ లు డాక్టర్ టి. వినోద్, డాక్టర్ సుధాకర్ లు రోగులను పరీక్షించి మందులను సూచించారు. ఈ వైద్య శిబిరంలో మెడికవర్ ఫార్మసిస్ట్ దుర్గ, మెడికల్ రెప్స్ ఖలీల్, షేక్షావలి, శాస్త్రి ,శంకర్, మధుసూదన్,లు మందులు పంపిణీ చేశారు. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం వైస్ చైర్మన్ బి. రామాంజనేయులు పర్యవేక్షణలో ఆర్గనైజర్లు వై. శిరీష, జె .ఎన్ .శేషయ్య, రంగస్వామి, బసయ్య సుధాకరప్ప, హుస్సేనయ్యలు తమ సేవలను రోగులకు అందించారు.

➡️