బేకరీపై ఉక్రెయిన్‌ దాడి

Feb 5,2024 10:30 #Attacks, #Ukraine
Ukraine attack on bakery

28కు చేరిన మృతుల సంఖ్య

మాస్కో : రష్యాలోని లుగాన్క్స్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌లోని లిసిచాన్క్స్‌ పట్టణంలోని ఒక బేకరీపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడిలో మృతుల సంఖ్య 28కి చేరుకుంది. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలోని ఎమర్జెన్సీ సర్వీసెస్‌ అధికారులు ఆదివారం వెల్లడించారు. శనివారం రద్దీగా ఉండే సమయంలో ఈ క్షిపణి దాడి జరిగిందని, అమెరికా తయారు చేసిన హెచ్‌ఐఎంఎఆర్‌ఎస్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచ్‌ సిస్టమ్‌ ఉపయోగించి ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఒక చిన్నారితో సహా 28 మంది మరణించారని చెప్పారు. బేకరీ శిధిలాల నుంచి పది మందిని రక్షించామని, వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.బేకరీపై ఉక్రెయిన్‌ అనాగరిక దాడిని ఖండిస్తూ ఆదివారం లుగాన్క్స్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌లో సంతాప దినాన్ని పాటించారు. ఉక్రెయిన్‌ ఉద్దేశపూర్వంగానే బేకరీపై దాడికి పాల్పడిందని అధికారులు ఆరోపించారు.

➡️