ప్రభుత్వ పాఠశాలలో ఉగాది పండుగ సంబరాలు 

Apr 8,2024 12:49 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో క్రోధి నామ సంవత్సర ఉగాది సంబరాలు ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ, చిట్టూరి వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు తెలుగుదనము ఉట్టిపడేలా చీరకట్టు, పంచెకట్టులతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సంవత్సరం ఉగాది నుండి హిందువులకు నూతన సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. జీవితంలో కష్టాల, సుఖాలు మరియు బాధలు ఉంటాయి. అయితే ఈ ఉగాది మీ జీవితంలో సుఖ సంతోషాలు మరియు సంపద, ఆరోగ్యం ఆయుష్యు అందివ్వడానికి ఉగాది పండుగ జరుపుకుంటారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేసారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య కమిటీ చైర్ పర్సన్ క్రాంతి, తల్లిదండ్రులు, గ్రామస్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పి.శేషారత్నం పాల్గొన్నారు.

➡️