మరొకరు తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-పెదరాయపాడు : ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన పెదరాయపాడు వేంపాడు రహదారిలో శుక్రవారం ఉదయం జరిగింది. వేంపాడు గ్రామానికి చెందిన గోపనబోయిన రామారావు (40) తనకు చెందిన వ్యవసాయ భూములో మిరప తోటలో పనిచేస్తున్న కూలీలకు టిఫిన్ తీసుకు వద్దామని ముండ్లమూరుకు తనకు చెందిన (AP27BM2531) ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుండగా రాయపాడు గ్రామానికి చెందిన ఉలవ మల్లికార్జున్ (AP39LD1307) అద్దంకి వెళ్తుండగా పెదరాయపాడు రహదారిలో ఉన్న మలుపుల వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనంది. గోపనబోయిన రామారావు సంఘటన స్థలంలో మృతి చెందాడు. మల్లికార్జున కు తలకు బలమైన గాయాలు ఇవ్వడంతో ఒంగోలు హాస్పిటల్ కు తరలించారు విషయం తెలుసుకున్న ముండ్లమూరు ఎస్.ఐ ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.