ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

Feb 25,2024 23:10

ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని చెరుకూరు ఎకెఎంఆర్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను కరస్పాండెంట్ పట్రా యూలి సస్పెండ్ చేశారు. విధినిర్వహణలో అలసత్వం వహించిన ఉపాధ్యాయులు సిహెచ్ వెంకటేశ్వర్లు, కె పద్మావతమ్మను ఈనెల 22న సస్పెండ్ చేసినట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులకు వివరణ కోరుతూ పలుమార్లు మెమోలు జారీ చేసినప్పటికీ స్పందించలేదని, అందుకే సస్పెండ్ చేసినట్లు వివరించారు. విధుల నుండి తొలగించిన అనంతరం తమను పాఠశాల్లోకి అనుమతించాలని ఉపాధ్యాయులు గేటువద్దే కూర్చొని తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

➡️