ఇంటర్‌ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మంగళవారం జరిగిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలో ఇద్దరు విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. డి బార్‌ అయిన వారిలో భారతి జూనియర్‌ కాలేజి కొట్టవలసలో ఒకరు, వంగర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మరోకరు డిబార్‌ అయ్యారని అర్‌ఐఓ ఎం.ఆదినారాయణ తెలిపారు. మంగళవారం జరిగిన పరీక్షలో 73 కేంద్రాల్లో 19852 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 19004 మంది హాజరు కాగా.. 848 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

➡️