సిలిండర్‌ పేలుడు : ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

Nov 25,2023 12:08 #Fire Accident, #Mumbai

 

ముంబయి (థానే) : ముంబయి థానేలోని ముంబ్రా ప్రాంతంలో స్క్రాప్‌ దుకాణంలో సిలిండర్‌ పేలింది. ఈ పేలుడు కారణంగా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన వారిద్దరిలో ఒకరికి 60 ఏళ్లు ఉంటాయి. మరొకామెకి 55 ఏళ్లు ఉంటాయి. ఈ ఘటనలో గాయాలైన వారిని స్థానికులు చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ పేలుడు కారణంగా ఆ షాపుకి ఆనుకుని ఉన్న ఇళ్లు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

➡️