ప్రజాశక్తి -కలకడ (అన్నమయ్య) : ఆటో, టాటాఎసి ఢీకొట్టుకోవడంతో ఇద్దరికి గాయాలైన ఘటన గురువారం రాత్రి కలకడ మండలంలోని బాలయ్యగారిపల్లి పంచాయతీ వద్ద చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై జరిగింది. మండల కేంద్రమైన కలకడ రాజీవ్నగర్ కాలనీకి చెందిన సాదిక్ అలీ, అన్వర్ భాషలో ఆటోలో వస్తుండగా, ఎదురుగా వస్తున్న టాటాఏసీని జాతీయ రహదారిపై ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సాధిక్ అలీ తలకు బలమైన గాయమయ్యి రక్తస్రావమయ్యినట్లు తెలిసింది. అన్వర్భాషకు కుడి కంటి కనుబమ్మపై బలమైన రక్తగాయమయ్యింది. గాయపడిన ఇద్దరినీ 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.