ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ శుక్రవారం వేంపల్లిలోని తులసిరెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజంపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు శ్రీనాథ్ తెలిపారు. పార్టీలో యువత చేరికపై ఆసక్తి చూపుతున్నట్లు ఆయనకు వివరించారు. త్వరలోనే భారీ సంఖ్యలో యువత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తులసిరెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు బొమ్మిశెట్టి హరినాథ్, బాదనపురి శివ, సీమకుర్తి వంశీ తదితరులు పాల్గొన్నారు.