అనసూర్యమ్మకు నివాళి

Jan 29,2024 00:14

ప్రజాశక్తి – పర్చూరు
అనారోగ్యంతో గత రాత్రి మృతి చెందిన గోగుల అనసూర్యమ్మ (81) మృతదేహాన్ని వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆదివారం సందర్శించి నివాళి అర్పించారు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కృష్ణారావు, శ్రీనివాసరావు, పూర్ణను ఓదార్చి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఆయన వెంట కోటా హరిప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రావువారి ప్రసాద్, మల్లా శ్రీనివాసరావు, కంచెనపల్లి రమేష్, తులసి నాగమణి, గాదె సురేష్, ఆకుల హేమంత్, తులసి శివ నాగేశ్వరరావు, లంకా శివ ఉన్నారు.

➡️