ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఐఎఎస్ అధికారులను బదిలీలు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం జీఓ ఆర్టి నెంబరు 351ను విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సుమిత్కుమార్ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ప్రశాంతిని అగ్రికల్చరల్ మార్కెటింగ్ శాఖ కు బదిలీ చేశారు. పౌర సరఫరాల కార్పొరేషన్లో డైరెక్టర్గా పనిచేస్తున్న విజయసునీతను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరుగా నియమించారు. సివిల్ సప్ల్లై ఎండిగా పనిచేస్తున్న వీరపాండియన్కు డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. రాహుల్పాండేకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జిఎడిలో రిపోర్టు చేయాలని జీఓలో ప్రభుత్వం పేర్కొంది.