చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

Mar 10,2024 14:19 #Bapatla District, #trafic zam

ప్రజాశక్తి-చీరాల : సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు భారీగా తరలి వెళ్తున్న వివిధ స్కూల్, కళాశాల, ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలతో చీరాల ఒంగోలు జాతీయ రహదారి లో 5 కిలోమీటర్ల పైగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో  వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులందరూ సీఎం బందోబస్తులో ఉండడంతో రహదారిపై అడ్డగోలుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఒంగోలు చీరాల రాకపోకలు ఎక్కడికక్కడే స్థంభించాయి.

➡️