ప్రజాశక్తి – యు.కొత్తపల్లి
ఉప్పాడ సాగర తీరం పర్యాటకులతో కిక్కిరి సిపోయింది. గురువారం రంజాన్ పండగ వేల సెలవు దినం కావడంతో లైట్హౌస్ నుంచి ఉప్పాడ వరకు తీరంలో సేద తీరేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. ఒకపక్క ఎండల అధికంగా ఉండడంతో ఎండ తీవ్రతను తట్టుకు నేందుకు కూడా పర్యాటకులు వస్తున్నారు సాయంత్రమైతే బీచ్ రోడ్డు కార్లు, ద్విచక్ర వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. బీచ్ రోడ్డుకు ఒకపక్క రాళ్లు వేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. సాగర సోయగాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు వ్యాఖ్యానించారు. చిరు చీకటి పడితే ఆగతాయిల బెడద ఎక్కువగా ఉంటుందని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.