నేడు బిసి కార్పొరేషన్‌ భవన్‌ ముట్టడి

Jan 29,2024 10:55 #BC Corporation Bhavan, #YSP Govt

 ఎపి రజక వృత్తిదారుల సంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  :   రజకులకు వైసిపి ప్రభుత్వం నిధులు కేటాయించకుండా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం చేపట్టనున్న బిసి కార్పొరేషన్‌ భవన్‌ ముట్టడిని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం బిసిలకు పూర్తిగా అన్యాయం చేస్తోందన్నారు. కులాల వారీ ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌లకు నిధులివ్వకుండా రాజకీయంగా పదవులు కట్టబెట్టి మోసపుచ్చిందని అన్నారు.

➡️