- నేడు న్యూజిలాండ్ జట్టుతో సూపర్-6 మ్యాచ్
- ఐసిసి అండర్-19 వన్డే ప్రపంచకప్
జొహన్నెస్బర్గ్: ఐసిసి అండర్-19 వన్డే ప్రపంచకప్లో దుర్భేధ్యఫామ్లో ఉన్న భారత యువ క్రికెటర్లకు అసలు పరీక్ష మంగళవారం ఎదురుకానుంది. గ్రూప్ దశలో ఓటమి ఎరుగని ఉదరు సహారన్ సారథ్యంలోని భారతజట్టు మంగళవారంనుంచి ప్రారంభం కానున్న సూపర్-6 తొలి మ్యాచ్లోనూ కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. గ్రూప్-ఎలో భారతజట్టు తొలి లీగ్ మ్యాచ్లోనే పటిష్ట బంగ్లాదేశ్ను చిత్తుచేయగా.. ఆ తర్వాత ఐర్లాండ్, అమెరికాలపై సునాయాసంగ విజయాలను నమోదు చేసింది. గ్రూప్ దశలో భాగంగా భారతజట్టు తొలి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 84పరుగుల తేడాతో గెలుపొందగా.. రెండో లీగ్లో ఐర్లాండ్, అమెరికాలపై 201పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్-ఎలో వరుసగా మూడు విజయాలతో టాపర్గా నిలిచింది. మరోవైపు గ్రూప్-డిలో న్యూజిలాండ్ జట్టు 2మ్యాచుల్లో గెలిచి పాక్ చేతిలో ఓటమితో రెండోస్థానంలో నిలిచింది. ప్రతి గ్రూప్లో టాప్-లో ఉన్న జట్లు నేరుగా సూపర్-6 పోటీల్లో ఆడనున్నాయి.
నేడు జరిగే సూపర్-6 మ్యాచ్లు..
శ్రీలంక(అండర్-19) × వెస్టిండీస్(అండర్-19)
పాకిస్తాన్(అండర్-19) × ఐర్లాండ్(అండర్-19)
ఇండియా(అండర్-19) × న్యూజిలాండ్(అండర్-19)