నేటి చిన్నారులే రేపటి దేశ సంపద

Mar 10,2024 23:58

ప్రజాశక్తి – బాపట్ల
నేటి చిన్నారులే రేపటి దేశ సంపదని రక్షిత మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. మానవతా ఆధ్వర్యంలో స్థానిక చీలు రోడ్డు సెంటర్ ఎకోహౌస్‌లో జరిగిన మహిళా దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. మానవతా బాపట్ల శాఖ అధ్యక్షులు డాక్టర్ బి శరత్ బోస్ అధ్యక్షత వహించారు. సభలో సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థి దశలో చిన్నారులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సోషల్ మీడియాకు సాధ్యమయినంత వరకు దూరంగా ఉంచాలని అన్నారు. పిల్లలపై సమాజ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఆయా పరిస్థితుల్లో సమాజంలో మంచి చెడులను పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అంద చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఇనజ కుమారి, గైనకాలజిస్ట్ మీనా, యోగ శిక్షకులు శైలజ, మానవత మహిళా విభాగ కన్వీనర్లు పద్మజ, అనంత కుమారి, ప్రసన్న, నాగలక్ష్మి పాల్గొన్నారు.

➡️