అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డూలు

Jan 18,2024 16:49 #laddu, #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి-తిరుమల: అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డూలను (ఒక్కో లడ్డూ.. 25 గ్రాములు) పంపించనుంది. ఈ మేరకు తిరుమలలోని బూందీపొటులో 25గ్రాముల బరువుతో లక్ష లడ్డూలు తయారీని పొటు కార్మికులు ప్రారంభించారు. సిద్ధమైన లడ్డూలను ట్రేలలో పేర్చి వాహనంలో సేవాసదన్‌కు చేర్చుతున్నారు. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు లడ్డూలు చొప్పున ప్యాకింగ్‌ చేశారు. ఇలా మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. ఈ లక్ష లడ్డూలను విమానంలో ఆయోధ్యకు టీటీడీ పంపనుంది. ఈ కార్యక్రమంలో 350 మంది శ్రీవారి సేవకులు, టిటిడి డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, పోటు ఏఈవో శ్రీనివాసులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️