తూర్పు కాపులకు టిక్కెట్లు ఇవ్వాలి

Mar 15,2024 12:01 #Vizianagaram

తూర్పు కాపు సామాజిక వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్ష
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నచోట్ల ఎంపి,ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలనీ తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి.అప్పారావు, జిల్లా అధ్యక్షులు రొంగలి రామారావులు డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. దీక్షను ఉద్దేశించి వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్నారు. రాజ్యాధికారం ఇవ్వడంలో రాజకీయ పార్టీలు తూర్పు కాపుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రానున్న ఎన్నికలలో ఎంపి,ఎమ్మెల్యే టిక్కెట్లు కాపు సామాజిక వర్గం వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తూర్పు కాపులు ఏకమై రాజ్యాధికారం కోసం సాధించుకోవడానికి అందరూ ముందుకు రావాలనీ కోరారు. మేము జెండాలు మోసెందుకి లేమని మాకు రాజ్యాధికారం కావాలని, అధికారంలో బాగా స్వామ్యం కావాలని డిమాండ్ చేశారు. వెంటనే అన్ని రాజకీయ పార్టీలు తూర్పు కాపులుకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్షలో ఎం.రామారావు, ఎస్.సాంబ, జి మోహనరావు, టి వెంకటరావు, ఎస్.సత్యన్నారాయణ, సిహెచ్.చిన్ని, జి.వెంకట రమణి, పి.రామారావు, పి.సన్ని, బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️