రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Jan 17,2024 15:35 #road accident, #vijayanagaram

విజయనగరం : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పార్వతిపురం బెల్హం అగ్రహారానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మహేశ్‌, అతని చిన్నాన్న సత్యనారాయణ, పిన్ని నరసకుమారి సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన వ్యాన్‌ కారును డీ కొట్టడంతో మహేశ్‌, నరసకుమారి అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని విజయనగరం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

➡️