చోరీ కేసును 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Dec 20,2023 14:54 #Anantapuram District, #chori

ప్రజాశక్తి-అనంతపురం: అనంతపురం జిల్లాలో ఐడీబీఐ బ్యాంక్‌ వద్ద జరిగిన చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఎస్పీ అన్భురాజన్‌ వివరించారు. ఏటీఎం ఉద్యోగిగా పనిచేస్తున్న పోతురాజు.. డబ్బుపై కాజేయాలని భావించి తన స్నేహితులతో కలిసి బ్యాంకు నుంచి డబ్బు తీసుకొస్తున్న టైమ్‌లో దోపిడీ జరిగినట్లు చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. తనపై దాడి చేసి డబ్బు తీసుకెళ్లారని తప్పుడు ఫిర్యాదు చేశారు. పోతురాజు సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అతడిని విచారించగా.. ఈ డ్రామా బయటపడింది. మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 46,55,723 నగదు, రెండు మోటార్‌ సైకిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

➡️