భోగిమంటల్లో వైసీపీ చీకటి జీవోలు దహనం

Jan 15,2024 00:50

ప్రజాశక్తి – రేపల్లె
రాష్ట్రంలో కీడు తొలిగి, ఏపీ వెలగాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ చీకటి జీఒలను, అక్రమ కేసులను భోగిమంటల్లో వేసినట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రానికి కీడు పట్టిందని అన్నారు. ఈ సంక్రాంతితో కీడు వదిలి చంద్రబాబు నాయకత్వంలో వెలగాలనే సంకల్పంతో భోగి మంటల వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. భోగి మంటల్లో చీకటి జీఒలు, చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ ప్రతులను భోగి మంటల్లో వేశామన్నారు. ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌రెడ్డి చీకటి పాలనను భోగి మంటల వెలుగుల్లో తరిమికొట్టాలని కోరారు. ప్రజలందరికి కష్ట, నష్టాలు తొలగి స్వేచ్ఛాయుత జీవితం గడపాలంటే వైసిపి పాలన అంతానికి ఈ సంక్రాంతి ఆరంభం కావాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవి నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, తేజ పాల్గొన్నారు.

➡️