నోయిడా: ప్రొ కబడ్డీ సీజన్-10లోనూ తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటికే 6 మ్యాచుల్లో ఓడిన టైటాన్స్ శనివారం యు ముంబ చేతిలోనూ చిత్తుగా ఓడింది. తొలి అర్ధభాగంలో యు ముంబను నిలువరించిన టైటాన్స్.. రెండో అర్ధభాగంలో చేతులెత్తేసింది. సూపర్ ట్యాకిల్స్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యు ముంబ జట్టు 52-34పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్కు కెప్టెన్ పవన్ షెహ్రావత్ బెంచ్కే పరిమితమయ్యాడు. రైడ్లలో రాంబిన్(7), రజ్నీష్(8), ఫ్రాఫుల్(7) రాణించగా.. ట్యాకిల్స్లో నిరాశపరిచింది. ఇక యు ముంబ జట్టులో గుమన్ సింగ్(10), జఫన్డేశ్(8) రైడ్స్లో రాణించగా.. రింకు(8), సోంబిర్(8) ట్యాకిల్స్లో మెరిసాడు. ఈ ఓటమితో టైటాన్స్ 8మ్యాచులు పూర్తయ్యేసరికి 7 ఓటములు, ఓ గెలుపుతో 12వ(చివరి) స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 35-25పాయింట్ల తేడాతో యుపి యోథాను చిత్తుచేసింది.
ప్రొ కబడ్డీలో నేడు..
గుజరాత్ జెయింట్స్ × బెంగాల్ వారియర్స్(రాత్రి 8.00గం||లకు)
తమిళ్ తలైవాస్ × బెంగళూరు బుల్స్(రాత్రి 9.00గం||లకు)