తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేశారు. సోమవారం ఆమె పంపిన రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు. 2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. రాజీనామా అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విమానంలో చెన్నై బయల్దేరి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరినే’ అని అన్నారు. గవర్నర్‌ పదవి చేపట్టకముందు తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా తమిళి సై వ్యవహరించారు. ఆమె తమిళనాడులో ఏదో ఒక లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ తరుఫున బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

➡️