Tamil Nadu : భవనం కూలి ఆరుగురు మహిళా కార్మికులు మృతి

Feb 7,2024 15:31

ఊటీ (చెన్నై) : తమిళనాడులోని ఊటీ సమీపంలో లవ్‌డేల్‌లో బుధవారం భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కార్మికులు మృతి చెందారు. చనిపోయిన వారిలో సకిల (30), సంగీత (35), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మీ (36), రాధ (38)లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారని వారిని చికిత్స ఊటీ జనరల్‌ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒక కార్మికుడు శిథిలాలలో చిక్కుకున్నాడని.. అతన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్య్రత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు.

➡️