అమరావతి : సిఎం జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపి ని నట్టేట ముంచారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. తాడేపల్లిలోని పూజిత అపార్టుమెంట్ వాసులతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ … టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకాలంలో జీతాలు చెల్లించారని గుర్తు చేశారు. మంగళగిరిని అభివృద్ధి చేయాలంటే వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 2019లో ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో.. అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తామని లోకేశ్ అన్నారు.