కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్‌  :  కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతమవుతుందని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెటిఆర్‌ పేర్కొన్నారు. న్యాయ విచారణ కమిషన్‌ వేయాలని, బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కోరారు. కులగణన కోసం బిల్లు తెస్తే తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లో బిల్లును ఆమోదించుకుందామని తెలిపారు. అయితే కులగణనకు చిత్తుశుద్ధి అవసరమని, బిల్లు కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినా వివరాలు బయటపెట్టలేదని అన్నారు. తీర్మానంపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు స్పీకర్‌ ప్రకటించారు.

➡️